యల్లటూరు ఆధ్వర్యంలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: నందలూరు మండల పరిధిలో హరిజనవాడనందు శుక్రవారం జనసైనికులతో సమావేశం నిర్వహించాం జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్ 29 తేదీన నందలూరు మండలంలో అంగరంగ వైభవంగా యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల కార్యాలయం ప్రారంభించడం జరుగుతుందని, ఆరోజు జరిగే బారి ర్యాలీలో పాల్గొనమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందలూరు హరిజనవాడ జనసైనికులు డి. కళ్యాణ్, వంశి, లోకేష్, కె వంశి, వెంకటేష్, రాజేష్, కిరీటి, బాబు, హరి, ప్రవీణ్, వరప్రసాద్, మధు, సాయి రామ్, రాజగోపాల్ మొదలగిన జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందలూరు నాయకులు ఆకుల చలపతి, ప్రశాంత్ భారతాల పాల్గొన్నారు.