కదిరి జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

తనకల్లు మండలం, తవలం గ్రామంలో జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్ళు- పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమం నిర్వహించదం జరిగింది. ఈ గ్రమంలో 22 మందికి ప్లాట్స్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కట్టడాలు జరగలేదు. 3 సంవత్సరాలు పైబడి కావస్తున్నా ఇచ్చిన హామీల 20% కూడా నిర్మాణం జరగలేదు. ప్రభుత్వానికి ఉన్న ఒక సంవత్సరం సమయంలో 20 లక్షల ఇళ్ళను నిర్మించగలుగుతుందా అని జనసేన పార్టీ ద్వారా ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కె.వి రమణ, కొట్టి కుమార్, శ్రీనాథ్, లక్ష్మణ్, కార్యక్రమాల కమిటీ మెంబర్ ఫయాజ్, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, అనిల్, ముబారక్, బా బ్జాన్, అమర్ కార్తికేయ ఎంపీటీసీ పాల్గొన్నారు.