హిందూపురం జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

హిందూపురం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ మరియు మండల అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళు – పేదలకు కన్నీళ్లు, #janananna mosam కార్యక్రమంలో బాగంగా హిందూపురం పట్టణానికి నాలుగు కిలోమీటర్లు దూరంలో కోటిపి దగ్గరలో గల జగనన్న కాలినిని పరిశీలించి అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు రెండు వేల పైచిలుకు లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఇప్పటిదాకా కనీసం పది ఇళ్ళు కూడా పూర్తి కాలేదు. ఎంతో అర్బటలతో ప్రారంభించిన జననన్న కాలినీలు సరైన వసతులు లేక ఆధ్వన్న స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి అయినా కనీసం పది శాతం ఇళ్ళు కూడా పూర్తి చేయకపోవడం వైసీపీ పాలనకు నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి లబ్ధిదారులకు ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వాలని హిందూపురం జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో హిందూపురం పట్టణ అధ్యక్షుడు కోళ్లకుంట శేఖర్, జనసేన నాయకులు మరియు జన సైనికులు ప్రభు దాస్, హనుమంతు, మనోహర్, రామాంజి, హరీష్, లింగరాజు, ప్రశాంత్, బాబు, వెంకటేష్, చింత హనుమంతు, దివాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.