కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన ప్రచారం

నెల్లూరు: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని మసీదు సెంటర్, గాంధీ బొమ్మ, బొడ్డుచౌక్ ప్రాంతాల్లో జనసైనికులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని, తిరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ బలపర్చిన తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు గారికి కమలం గుర్తుపై, గూడూరు నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు పఠాన్ ఇమ్రాన్, కార్యదర్శులు ఉప్పు సాయి కిరణ్, మట్టింపాటి సనత్ కళ్యాణ్, రాకేష్, ఓంకార్, సంయుక్త కార్యదర్శులు పెంచలయ్య, సుబ్రమణ్యం, షారుఖ్, వసంత్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.