మానవత్వం చాటిన జనసేన జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలానికి చెందిన రౌతు.అప్పలనాయుడుకి ఎమర్జెన్సీ ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరమవగా పాపమ్మపేట గ్రామానికి చెందిన జనసైనికులు గణేష్ అనిల్ బ్లడ్ చాలా అవసరం అని జనసేన జానీకి తెలియచేయడంతో వెంటనే స్పందించి శ్రీకాకుళం రాగోలు జేమ్స్ హాస్పిటల్ కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన జాని మాట్లాడుతూ ఈరోజు మీకు బ్లడ్ ఇచ్చాను అంటే మా జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ స్పూర్తి. ప్రజలందరి మంచి కోరే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం అని చెప్పడం జరిగింది.