జనసైనికుడు రవికుమార్ కుటుంబానికి జనసేన భరోసా
- జనసైనికుడు రవికుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, వేములనర్వ గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల కార్యదర్శి మాతంగి రవికుమార్ ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించారు. రవికుమార్ కుటుంబానికి వారి పిల్లల చదువు ఖర్చుల నిమిత్తం.. పిల్లల పుస్తకాలకు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బోలియశెట్టి శ్రీకాంత్ ఆర్థిక సహాయం అందజేశారు. రవికుమార్ కుటుంబానికి జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ, తుడుము శైలజ, తునికిపాటి శివ, తన్నీరు గోపినాధ్, రామకోటేశ్వరావు, సాగర్ మీరా తదితరులు పాల్గొన్నారు.