బాధిత కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో బొక్షం చీరంజివి పాము కాటుకి గురై చనిపోవడం జరిగింది. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు వచ్చి పరామర్శించి 25,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఆ ఆర్థిక సహాయాన్ని సోమవారం నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి ద్వారా అంద చేశారు. భవిష్యత్తులో మీకు మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని అని భరోసా ఇచ్చారు.