మున్సిపల్ కమిషనర్ దినేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరానికి నూతన మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన దినేష్ ను జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.