రేచర్ల పేటలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటి:  జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో బుధవారం 6వ డివిజన్ రేచర్ల పేట ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు కలిసి వారికి ఏవైనా పధకాలు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సహజంగా ముస్లిం వర్గాలకు మతాచారంప్రకారం పిల్లలు ఎక్కువ ఉంటారనీ కానీ ఈ వై.సి.పి ప్రభుత్వం తన పధకాలలో కేవలం ఒకళ్ళకే వర్తించేలా నియమం పెట్టి మిగిలిన పిల్లలకి అన్యాయం చేస్తోందని చెప్పారు. ఇది పిల్లలలో అసమానతలను పెంచేదిగా ఉందనీ దీనితో పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం చేసే పనులూ ఎలా ఉన్నాయంటే అర్ధాకలితో ఆశగా వారు విదిల్చే సహాయంకోసం ఎడురుచూసేలా చేస్తోందన్నారు. అసలు గవర్న్మెంట్ పాఠశాలలు పటిష్టంగా నిర్వహిస్తే ప్రయివేటు పాఠశాలలకై ప్రజలు ఎందుకు చూస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయినుద్దీన్, ఎస్.కే. సంధానీ, ఎండి. సలీం, ఎస్.కే. షాజహాన్, ఎండి. షరీఫ్, అజారుద్దీన్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.