దగదర్థి మండలములో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశము

  • కావలి నియోజకవర్గం, దగదర్థి మండలములో.. అంగరంగ వైభవంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశము

కావలి నియోజకవర్గం: జనసేన పార్టీ, కావలి నియోజకవర్గం, దగదర్తి మండలము, బాడుగులపాడులో మంగళవారం సాయంత్రం 6గఒ.లకు ఆత్మీయ సమావేశం వెంకట్ యాదవ్ అధ్యక్షతన, కావలి నియోజకవర్గ ఇంచార్జి అళహరి సుధాకర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనగా జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జి అళహరి సుధాకర్, దగదర్థి మందల అధ్యక్షుడు- వెంకట్ యాదవ్, అల్లూరు మందల అధ్యక్షుడు- సుధీర్, రఘువర్మ, అలా శ్రీనాథ్, తదితరులు మాట్లాడుతూ. టిడిపి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నాయకులతో కాకుండా గ్రామస్థాయి నాయకుల ప్రవర్తన సరిగా లేదని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తగ్గి కేవలము 21 మఒది ఎమ్మెల్యే , 2 ఎంపీ సిట్స్ తీసుకుంది కేవలం ప్రజల భవిష్యత్తు కోసం, రేపు టీడీపి ప్రభుత్వం వస్తె మీరు మా జనసేన నాయకులు మీకు అండగా ఉంటారని తెలిపారు. మా నాయకుడి, మా యొక్క త్యాగమే ఈ రోజు ఇక్కడ టీడీపి అభ్యర్ధికి టికెట్ రావడానికి కారణమని కావున మా గౌరవము మాకు ఇవ్వాలని గట్టిగా నినదించారు. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు టీడీపీ అభ్యర్థులు ఎంపీ & ఎమ్మెల్యే సైకిల్ గుర్తుపై ఒట్టు వేసి గెలిపించ వలసినదిగా కోరారు. ఈ సందర్భంగా ఈ సభకు హాజరైన వీరమహిళలకు, జనసేన నాయకులుకు, జనసైనికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.