అగ్నిప్రమాదంలో నిరాశ్రయులకు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అందజేసిన జనసేన

కాట్రేనికోన మండలంలోని తామర చెరువు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు దగ్దమై నిరాశ్రయులైన కుటుంబాలను పరామర్శించిన ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు జనసేన నాయుకులు. అనంతరం వారికి వస్త్రాలు, 4 వేలు ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందజేసి వారి పిల్లలకు నాలుగు జతల యూనిఫార్మ్స్, పుస్తకాలు సమకూరుస్తానని అలాగే జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. అలాగే ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది కోలుకుంటున్న ప్రముఖ పాత్రికేయులు రాంబాల విష్ణును వారి స్వగృహమునందు పలకరించి వారి ఆరోగ్యం పరిస్థితి తెలుసుకుని వారికి ధైర్యాన్ని చెప్పటం జరిగింది.