జనసైనికుడి కుటుంబానికి అండగా జనసేన

వేమూరు నియోజకవర్గం: ఇటీవల మరణించిన గోవాడ జనసైనికుడు పిరాటి శివానాగేశ్వరరావు కుటుంబ సభ్యులను శుక్రవారం నాయకులు కలసి పరామర్శించి.. ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి.. వారి కుటుంబానికి 21501 రూపాయలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి కమ్మెల శ్రీనివాస్ రావు, చావలి ఎంపీటీసీ గాజుల నగేష్, తాడికొండ శివ రామ కృష్ణ, జొన్న బాజి, కత్తి కిషోర్, దేవిరెడ్డీ మహేశ్, పూల సుబ్రమణ్యం పాల్గొన్నారు.