ఇంటింటికి జనసేన మాటలు

*జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా

అరకు వ్యాలీ మండలం, లోతేరు పంచాయతీ పరిధిలో గల తోటవలస గ్రామంలో జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా ఆధ్వర్యంలో బుధవారము ఇంటింటికి జనసేన మాటలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గృహాన్ని, పాఠశాలని పరిశీలించడం జరిగినది. అనంతరం ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై సాయిబాబా మాట్లాడుతూ… తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ గృహానికి బిల్లులు మంజూరు చేయాలని, నేటి వరకు పాఠశాల నిర్మాణాలు పూర్తి చేయని వృత్తిదారులపై ప్రభుత్వం విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులకు పింఛన్ నిలిపివేయడమ్ విడ్డూరంగా ఉందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తూ ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయగలరని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీనాథ్, శ్యామ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.