కళాకారుల సమస్యల పరిష్కారానికి జనసేన కృషి చేస్తుంది -వంగా రఘు

ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో గురువారం కళాకారుల వారోత్సవాల్లో భాగంగా కళాకారులందరూ కలిసి ప్రజానీకానికి వారు చేస్తున్న సేవలకి లక్ష్మీనారాయణ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ పత్సమట్ల ధర్మరాజు ని అభినందించి సత్కరించడమే కాకుండా ఆయనతో పాటు ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ వంగా రఘు, శ్రీ కట్రేడ్డి చంద్రశేఖర్, అడవికొలను గ్రామ సర్పంచ్ శ్రీ పాల వెంకన్న, అడవికొలను గ్రామ ఎంపిటిసి శ్రీ నిమ్మల దొరబాబు, బావాయిపాలెం ఉప సర్పంచ్ శ్రీ ముత్యాల కాశీ, ఉంగుటూరు నాయకులు శ్రీ గట్టెం నాని లను అభినందించి సన్మానించడం జరిగింది. అనంతరం శ్రీ ధర్మరాజు మాట్లాడుతూ కళాకరులకు మా సేవా సంస్థ ద్వారా ఎప్పుడు సహయం అవసరమైనా మా వంతు సహకారం అందిస్తామన్నారు. అలాగే జనసేన నాయకులు శ్రీ వంగా రఘు మాట్లాడుతూ కళాకారుల సమస్యలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు.