చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు

చీరాల నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకి ఆకర్షితులై, జనసేన సిద్ధాంతాల మీద మక్కువతో శనివారం చీరాల నియోజకవర్గంలోని వివిధ మత్స్యకార గ్రామాల నుంచి వచ్చిన 20 మంది మత్స్యకారులు వాయిల శ్రీను మరియు కొందురి సుధీర్ ఆధ్వర్యంలో, నియోజకవర్గ యువ నాయకులు పసుపులేటి సాయి పర్యవేక్షణలో మత్స్యకార సోదరులు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షంలో చీరాల జనసేన పార్టీ కార్యాలయం నందు పార్టీలో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెంప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్, ప్రకాశం జిల్లా కార్యదర్శి ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్, ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగ ఉపాధ్యక్షులు పింజల సంతోష్, జనసేన నాయకులు అలా శ్రీధర్, రావూరి బాలాజీ, తోట రాజా మరియు యువ నాయకులు షేక్ హురుమ్ బాషా పాల్గొనడం జరిగినది.