రంపచోడవరం జనసేనలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రంపచోడవరం మండలం, రంప పంచాయతీ మర్రివాడ గ్రామంలో మండల అధ్యక్షులు పి.ఆర్.పి శ్రీను అధ్వర్యంలో జనసేన సిద్ధాంతాలకు విధి విధానాలకు ఆకర్షితులు అయ్యి 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరిని నియోజకవర్గ నాయకులు కుర్ల రాజశేఖరరెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు అందటం లేదని కనీస సౌకర్యలు అయిన రోడ్, ఆరోగ్యం, సురక్షిత మంచినీరు, అందించటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వీటిని ప్రజలకు అందిస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కొణతం శ్రీనివాస్, ఆకుల జయరామ్, గుగులు సుబ్రమణ్యం, యర్రగొండ మల్లేశ్వరరావు, సింగోజి సుబ్రమణ్యం, వేదురుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.