పిడుగుపాటుకు పాడిగేదేలు కోల్పోయిన రైతుకు జ్యోతుల శ్రీనివాసు ఆర్థిక సహాయం

పిఠాపురం: అకాల వర్షం కారణంగా ఆదివారం గొల్లప్రోలు మండలం, పి.జగ్గంపేట గ్రామంలో నమ్మి దొంగబ్బాయి నిరుపేద రైతు 2 పాడి గేదేలు అకాలంగా మరణించాయి. సోమవారం పి.జగ్గంపేట గ్రామానికి సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు మరియు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు వెళ్ళి నమ్మి దొంగబ్బాయిని పాడిగేదేలకు జరిగిన ప్రమాదం గూర్చి అడిగి తెలుసుకొని, నమ్మి దొంగబ్బాయి కు జరిగి నష్టం గూర్చి సానుభూతిని తెలియజేసి ఆయనకు తగు ఆర్థికసహాయం అందజేశారు. ఈ ఆర్థికసహాయం కార్యక్రమంలో వమ్ము దొంగబ్బాయి, వమ్ము అప్పలరాజు, వమ్ము వెంకటరమణ, సారిపల్లి వెంకటరమణ, వమ్ము గంగాధర్, జనసైనికులు చందక వీరబాబు, విసరపు శ్రీనివాసు, రాయవరం జనసైనికుడు కె. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.