పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కనిగిరి జనసేన

కనిగిరి, భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా పామూరు పట్టణములోని కె.బి సినిమా ధియేటర్ నందు పవన్ కళ్యాణ్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మంచి విజయం సాధించాలని జనసేన పార్టీ తరఫున అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి యలమందల, రహిముల్లా, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త మరియు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు సిఎస్పురం మండల అధ్యక్షులు జానపాటి రాజా అదేవిధంగా కార్యకర్తలు ప్రవీణ్ నాయుడు నాని, మహిత్, నాగేంద్ర, గోస్ట్ సునీల్, నారాయణ, సునీల్, శ్రీనాథ్, వెంకటేష్, సాయి, రాజేష్, నాని తదితరులు పాల్గొన్నారు.