రెండవ టెస్ట్ కు సిద్ధం..ట్విటర్ లో కోహ్లీ, హర్ధిక్ పాండ్య!

పర్యాటక ఇంగ్లాండ్ జట్టు చెన్నై లో జరిగిన మొదటి టెస్ట్ లో ఊహించని విధంగా టీమిండియా కు షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ భీకర ఫామ్ ను కొనసాగిస్తూ డబుల్ సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక భారీ లక్ష్యాన్ని చేధించే క్రమం లో చతికిల పడ్డ టీమిండియా ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్‌ ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉంది. ఈ క్రమం లో గ్రౌండ్ లో చమటోడుస్తూ ప్రాక్టీస్ చేస్తుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విటర్ లో స్పంధిస్తూ ప్రాక్టీస్ కొనసాగుతుంది అంటూ ట్వీట్ చేశారు.

అలాగే హార్డ్ హిట్టర్ హర్ధిక్ పాండ్య కూడా ట్విటర్ లో స్పందిస్తూ రెండవ టెస్ట్ కు సిద్దమవుతున్నాం అంటూ ట్వీట్ చేశారు.. టీమిండియా టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కచ్చితంగా అర్హత సాధించాలి అంటే జరగబోయే మూడు టెస్ట్ లలో తప్పక విజయం సాధించాల్సి వుంటుంది. అందుకోసం టీమిండియా రెండవ టెస్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో విఫలమైన నదీమ్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన అక్షర్ పటేల్ అతడి స్థానంలో రానున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండగా.. ఎవరిపై వేటు పడనుందో తెలియాల్సి ఉంది. అలాగే బ్యాటింగ్ విభాగంలోనూ కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో మార్పు కు సంభందించి ఇంకా పూర్తి క్లారిటీ లేదు.