ఉద్ధానం బాధితుల కోసం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం

ఇచ్చాపురం నియోజకవర్గం: ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం సోంపేటలో నిమ్మసమ్మ గుడిలో దిగ్విజయంగా ప్రారంభించడం జరిగినది. మొదటి సంతకం ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు చేసి కార్యక్రమంలో ప్రారంభించారు. అక్కడినుండి మంగళ వీధి, బని శెట్టి వీధి, మెయిన్ రోడ్ లలో సుమారుగా 3 వేల సంతకాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో డా. శివాజీ, డా. కృష్ణమూర్తి కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా శివ గాయత్రి కాలేజ్ యాజమాన్యం కూడా తమ మద్దతు తెలియచేశారు. జాయింట్ సెక్రెటర్స్ ఈశ్వర్, దుర్యోధన, హరి బెహేరా, కంచిలి మండల అధ్యక్షుడు ఈశ్వర్, జనసై నికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.