మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం.. గాంధీకి ప్రధాని మోదీ నివాళులు..
మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ప్రధానమత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయాన్నే ప్రధాని మోదీ రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆయనతోపాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా గాంధీకి నివాళులర్పించారు. వారితోపాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ తాత్కలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాజ్ఘాట్కు చేరుకుని బాపూజీకి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ విజయ్ ఘాట్కు చేరుకుని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు.
#WATCH Prime Minister Narendra Modi pays floral tributes to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti pic.twitter.com/GE63jP2Nhe
— ANI (@ANI) October 2, 2021