యువశక్తి సభను విజయవంతం చేయండి – సన్నాహక సమావేశంలో నేతల పిలుపు

నెల్లిమర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈనెల 12 న నిర్వహించ తలపెట్టిన యువశక్తి సభను విజయవంతం చేసేందుకు జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ యువశక్తి మహాసభ ప్రచార కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ నెల్లిమర్ల నియోజవర్గం జనసేన నాయకురాలు లోకం మాధవి, అచ్చం నాయుడు ఇరువురు కలిసి నియోజకవర్గ నాయకులతో యువశక్తి మీటింగ్ విజయవంతం విషయమై నాయకుల యొక్క ముఖ్య సూచనలు, సలహాలు తీసుకొని సభను ఎలా విజయవంతం చేయాలని ఉద్దేశంతో దిశా నిర్దేశం చేశారు. లోకం మాధవి ఆధ్వర్యంలో యువశక్తి సభ విజయవంతం కోసం శుక్రవారం మధ్యాహ్నం 11గంటలకు లోకం మాధవి ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో యువశక్తి కార్యక్రమం విజయవంతం కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మరియు జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.