ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని సీబీఐ కార్యాయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లోథీ రోడ్ లో సీబీఐ ఆఫీసు ఉంది. ఈ భవనంలోని సీజీవో సముదాయంలో మంటలు చెలరేగడంతో సిబ్బంది తీవ్రభయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అగ్నికీలలు ఎగసిపడడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. ఘటన స్థలికి ఆరు ఫైరింజన్లను తరలించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.