నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాతృమూర్తి మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సయ్యద్ జిలాని గారి నాయకత్వంలో. భారతరత్న మాతృమూర్తి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా స్థానిక లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్లో మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో. మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సయ్యద్ జిలాని, నాయకులు మాట్లాడుతూ… విదేశాల్లో పుట్టిన మదర్ థెరిస్సా భారత పౌరసత్వం పొంది కోల్కతా 1950. సంవత్సరంలో మిషనరీ ఆఫ్ చారిటీ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి కోల్కతాలోని పీడిత పాడిత ప్రజలకు రోగులకు తాను సేవలను ఎంతో అందించారని, విద్యా, వైద్యం పేదవారికి అందాలని తను అందేలా కృషి చేసారని అన్నారు. ఆమె చేసిన సేవలు గాను భారత ప్రభుత్వం ఆమెకు నోబెల్ శాంతి బహుమతి మరియు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్నతో ఆమెను సత్కరించింది. జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ఆమె అడుగుజాడల్లో నడవాలని ఆమె స్ఫూర్తిని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి వి ఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్ బాబు, అబ్దుల్ రవూఫ్, కృష్ణంశెట్టి గోవిందు, బెల్లంకొండ అనిల్, సాంబశివరావు, ఆర్కే యాదవ్, వీరవల్లి వంశి, నాగుల్ మీరా, చిన్నపల్లి సాంబ, గుప్తా శ్రీకాంత్, మిరియాల సోము, ఎస్.డి గౌస్, దుర్గా కుమారి, మేడిశెట్టి రామారావు, తిరుమలశెట్టి శ్రీను, రాజా భరత్, విజయ్, రాముడు, యలమల కొండ, పోతంశెట్టి రాము, ఉల్లి చంటి, ధమలం కొండలు తదితరులు నివాళులర్పించారు.