చందుపట్ల సునీల్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాయ రమేష్

తెలంగాణ, పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళదాం అంటూ మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాయ రమేష్, మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా వారు పలు అంశాల మీద చర్చించి గెలుపు దిశగా పని చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఈరవైన ఓం ప్రకాష్, సునీల్, జనగామ పవన్, రాకేష్, ప్రశాంత్, దాసరి రమేష్, వినయ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.