నియోజకవర్గ అభివృద్ధికై ఆశీర్వదించండి: డా.సంపత్ నాయక్

తెలంగాణ, వైరా, కారేపల్లి మండలం, దుబ్బతండా గ్రామంలో ఆదివారం బిజెపి మద్దతుతో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.సంపత్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సంపత్ నాయక్ పి.హెచ్.డి మిత్రుడు కలిశారు. మిత్రునితో కలిసి గ్రామంలో పర్యటించారు. తన మిత్రుడు గ్రామ సమస్యలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి సంపత్ నాయక్ కి వివరించారు. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ ఈరోజు నా మిత్రుని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, నా మిత్రుడు మీ సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు, మీకు నేను అండగా ఉంటాను. జనసేన బిజెపి ప్రభుత్వ ఏర్పాటు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ అన్న పార్టీ “గాజు గ్లాస్ గుర్తు” కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి ముఖ్య నాయకులు, మండల, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.