నల్గొండలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మేకల సతీష్ రెడ్డి

నల్గొండ, జనసేన పార్టీని ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలోపేతం చేసే దిశగా నల్గొండలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఉమ్మడి నల్గొండ ఇన్చార్జ్ మేకల సతీష్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పవన్ అలువాల, ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్, సోషల్ మీడియా హెడ్ పూర్ణ చందర్ లొట్లపల్లి, కార్యదర్శి అశోక్, నాయకులు కార్తీక్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివ సాయి, విద్యార్ది విభాగం కొఆర్డినేటర్ సతీష్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.