ప్రజల కోసమే కూటమి బరిలోకి

తాడేపల్లిగూడెం, రాష్ట్ర ప్రజల బాగుకోసమే జనసేన కూటమితో కలిసి ప్రజల్లోకి వస్తుందని తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ సీపీ ప్రధాన నేత ఉంగరాల శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తోట గోపి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన అంతిమ దశకు చేరుకుందని ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల నియమావళిలో వాలంటీర్లు పనిచేయడానికి లేదని ఎన్నికల కమిషన్ తీర్పు ఇస్తే అది ప్రతిపక్షాలు చేసిన కుట్రని చెప్పి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.