దీపావళి నుండి సినిమా ప్రదర్శనలు షురూ

తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే దీపావళి నుండి థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించాలని తీర్మానించారు. కాకినాడ లక్ష్మీ థియేటర్‌లో జరిగిన జిల్లా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. `కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15 నుంచి సినిమా ప్రదర్శనలకు అనుమతించాయి. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల థియేటర్లను వెంటనే తెరవడం సాధ్యం కావడం లేదు. నిర్మాతల సహకారంతో దీపావళికి థియేటర్లు తెరవాలని నిర్ణయించకున్నాం. లాక్‌డౌన్ సమయంలో థియేటర్ల విద్యుత్ ఫిక్సెడ్ చార్జీలు మాఫీ చేస్తామని సినీ పెద్దల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల`ని కోరారు.