జనవరి 21, 22 తేదీల్లో నాగబాబు కర్నూలు, అనంతపురం జిల్లాల పర్యటన
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు జనవరి 21న కర్నూలు జిల్లా, 22 న అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. 21 శనివారం ఉదయం కర్నూలు జిల్లా వీర మహిళల కోసం ఏర్పాటు చేసిన సభలో, మధ్యాహ్నం జన సైనికులకు ఏర్పాటు చేసిన సభలో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు. 22 ఆదివారం అనంతపురం జిల్లా వీర మహిళలు, జనసైనికుల కోసం ఏర్పాటు చేసిన సభలలో నాగబాబు గారు పాల్గొని ప్రసంగిస్తారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/nagababu-1024x576.jpg)