తూర్పున మొదలైన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర

* రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కి ఘనస్వాగతం
*గజమాలలతో ముంచెత్తిన జన సైనికులు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కలసి మండపేట బయలుదేరారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం జిల్లాకు వస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే పార్టీ నాయకులతోపాటు వీర మహిళలు, జనసైనికులు మధురపూడి విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. వినామాశ్రయం వెలుపల భారీ గజ మాలలతో ముంచెత్తారు. ఆడపడుచులు హారతులు పట్టగా, జనసైనికుల పూలవర్షంలో తడిసి ముద్దవుతూ.. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. పార్టీ పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు అత్తి సత్యనారాయణ, తుమ్మల రామస్వామి, శ్రీమతి మాకినీడి శేషుకుమారి, వై. శ్రీనివాస్, శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి గంటా స్వరూప, డీఎంఆర్ శేఖర్, శ్రీమతి కడలి ఈశ్వరి, శ్రీమతి ముత్యాల జయ తదితరులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.