ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ ఘననివాళులు

ఖమ్మం జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించడం జరిగింది. మీ రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తా అని సాయుద పోరాటంలో ఆంగ్లేయులని దేశం నుండి తరిమికోట్టిన మహనీయుడు యువత సుభాష్_చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకొని జీవించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మైలవరపు మణికంఠ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మైలవరపు మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండ్ల పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.