రంగ్‌ దే షూటింగ్‌ను కంప్లీట్ చేసిన నితిన్..

కొత్త పెళ్లి కొడుకు నితిన్‌ వరుస ప్రాజెక్ట్స్ తో తెగ బిజీగా ఉన్నాడు.. పెళ్లి ఇలా అయిందో లేదో.. అప్పటి నుంచి లైన్ గా సినిమాల షూట్లకు అటెండ్‌ అవుతూ.. తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి అంటూ ఇలా నెలకో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు..ఇక మే లో మరో సినిమాని.. స్టార్ట్‌ చేయబోతున్నాడు ఈ యంగ్ హీరో.

ఇక రీసెంట్గా నితిన్‌ ఓ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాడంట. ఇదే విషయాన్ని నితిన్‌ ట్విట్టర్‌లో ఓ ఫన్నీ వీడియో పోస్ట్‌ చేసి మరీ తన అభిమానులతో పంచుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో నితిన్, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా చేస్తున్న సినిమానే రంగ్‌ దే!. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

అలాగే హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.