పవన్ డిమాండ్

భీమిలిలో జనసేన కార్యకర్త మూగి ప్రసాద్, బీజేపీ కార్యకర్త మూగి శ్రీనివాస్‌లపై వైసీపీ నాయకుడు ఊళ్ళ చిన్నా హత్యాయత్నానికి పాల్పడ్డారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితపై చిన్నా లైంగిక వేధింపులకు పాల్పడితే బీజేపీ, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారని.. అందుకే వారిపై హత్యాయత్నం చేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ఘటన విషయంలో భీమిలి పోలీసులు అనుసరిస్తున్న విధానం అన్యాయంగా ఉందని,

హత్య చేసేందుకు ప్రయత్నించిన అధికార పక్ష నేతను అరెస్ట్ చేయకుండా, బాధితుల పక్షాన నిలిచినవారిని అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని పవన్ అన్నారు. అలాగే వాలంటీర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేయాలిని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ తక్షణం స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు.