పలువురిని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పీ.ఎ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మంగళవారం ఇటీవల ప్రమాదంలో గాయపడిన ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం అగ్రహారం గ్రామానికి చెందిన చప్పిడి బెనర్జీని, అదేవిధంగా ముమ్మిడివరం బాలయోగి కాలువ గట్టుకు చెందిన పితాని శ్రీనివాసరావుని పరామర్శించారు. వీరి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి బాలకృష్ణ (పండు), జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు, గొలకోటి సాయి బాబా, కడలి వెంకటేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు.