బొబ్బిలిలో కందిపప్పును మింగేస్తున్న పందికొక్కులు

బొబ్బిలి: గత కొన్ని నెలలుగా రేషన్ లో బియ్యం ఎలాగూ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ అదే రేషన్ వాహనాల ద్వారా దళారీలకు దారి మళ్లిపోతున్న విషయం మనకు విధితమే. ఇపుడు బొబ్బిలి పట్టణంలోని చాలా వార్డులు మరియు రూరల్ లోని అధిక శాతం గ్రామాలలో పాపం కొన్ని పెద్ద పెద్ద పందికొక్కులు టన్నుల కొద్దీ కందిపప్పును రేషన్ వాహనాల నుంచి దొంగిలించి పెద్ద పెద్ద కిరాణా దుకాణాల వద్దకు తీసుకెళ్లి దాచేస్తున్నాయని జనసేన నాయకుల ద్రుష్టికి వచ్చింది. మరి మన ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఈ పందికొక్కులను ఎందుకు కట్టడి చెయ్యడంలేదో సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు బాబు పాలురు డిమాండ్ చేశారు. ఈ పందికొక్కుల స్వైరవిహారం కేవలం బొబ్బిలికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రమంతా ఉన్నప్పటికీ, ప్రభుత్వం మరియు పౌరసరఫరాల శాఖ నిద్రపొతున్నట్లు నటించడం గర్హనీయం.