కాలినడకన దర్శి జనసేన నాయకుల శ్రీశైల యాత్ర

దర్శి నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ.. 2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని కోరుతూ జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, ముండ్లమూరు మండల కమిటీ ఉపాధ్యక్షులు అంచులవీరాంజనేయులు – దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుండి గురువారం ఉదయం ఆరు గంటలకు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. ఉల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వచ్చే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశంపార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని కోరుతూ శ్రీశైల మల్లిఖార్జున స్వామివారికి మ్రొక్కుకోవడం కోసం మాల ధారణలో కాలినడకన బయలుదేరామని అన్నారు. వారి కార్యక్రమము విజయవంతం కావాలని, వారి కోరికను ఆ పరమేశ్వరుడు మన్నించి నెరవేర్చాలని జనసేన పార్టీ – దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు, క్రియాశీలక సభ్యులు తోట రాయుడు, చొప్పరపు తేజ, రాగుల కొండలు కోరుకుంటూ వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.