ఐసోలేషన్ లో ప్రభాస్..?

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ మేకప్ ఆర్టిస్ట్ కరోనా బారిన పడ్డారట. దీంతో ప్రభాస్ తో పాటు రాధే శ్యామ్ టీం మొత్తం ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే రాధేశ్యామ్ యూనిట్ షూటింగ్ ను నిలిపివేసింది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

కాగా ఈ ఏడాది జూలై 30న రాధేశ్యామ్ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు.