‘ఆచార్య’లో స్టైలిష్ విలన్..

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో వస్తున్న మూవీ ఆచార్య. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీ లో మెయిన్ విలన్ గా సోనూసూద్ నటిస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ మూవీ లో మరో స్టైలిష్ విలన్ ను తీసుకున్నారట. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’, ‘అశ్వథ్థామ’, ‘భీష్మ’ మూవీస్ లలో జిషు సేన్ నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.