నిరుపేద కుటుంబానికి ఇళ్ళు నిర్మించి ఇచ్చిన ఎన్నారై అనిశెట్టి స్వామి

జనసేనాని ఆలోచనలో భాగంగా…
జనసైనికుడిగా చూపిన ఔదార్యం…

రామచంద్రపురం నియోజకవర్గం, ఒక వ్యక్తి తాలూకు గొప్ప(మంచి)ప్రభావం సమాజంలో ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి జనసేన అధినేత ఉదాహరణ. ఆయన ఆలోచనలు మానవత్వం ప్రజలకి తోడుగా నీడగా అండగా ఉండలానే గొప్ప ఆశయం నేటికి కొన్ని లక్షలమంది అభిమానుల మనసుని కదిలించి విజయవంతంగా ముందుకు నడిపిస్తూనే ఉంది. అలా నడిపించేవారిలో ఎన్నారై స్వామి ఒకరు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం, పెనుమళ్ళ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తలాటం సత్యవేణి, తలాటం త్రిమూర్తులు, తలాటం నాగు మరియు తలాటం దివ్య పేదరికంతో కనీసం ఉండేందుకు ఒక చిన్నపాటి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న ఎన్నారై అనిశెట్టి స్వామి ముందుకు వచ్చి తన సొంతంగా వారికి ఇల్లును నిర్మించడం జరిగింది. ఇంటి నిర్మాణంలో ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ… మరోసారి అనిశెట్టి స్వామికి శతఘ్నిన్యూస్ తరపున హార్ధిక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము.