డాక్టర్ కందుల కార్యాలయంలో రాఖీ పండుగ వేడుకలు

  • కార్యాలయంలో నెలకొన్న సందడి వాతావరణం
  • నియోజకవర్గ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కందుల

వైజాగ్ సౌత్: తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల‌ నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే ర‌క్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రాఖీ పండుగ సందర్భంగా పలువురు వీరమహిళలు ఆయనకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంద‌న్నారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని పేర్కొన్నారు. మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.