భూ ఆక్రమణలపై జనసేన ఫిర్యాదుతో కదలిన రెవెన్యూ యంత్రాంగం

పొన్నలూరు మండల కేంద్రం, సర్వే నెంబర్ 265, 266 జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలాలను ఆక్రమించి అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ ఆస్తులు మరియు ప్రజల ఆస్తులను కాపాడాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దృష్టికి సామాజిక కార్యకర్త షేక్ హుస్సేన్ జనసేన పార్టీ పొన్నలూరు మండల అధ్యక్షుడు కనపర్తి మనోజ్ కుమార్ తీసుకెళ్లడంతో స్పందించిన కలెక్టర్ జడ్పి సీఈవో మరియు ఏడి సర్వే ల్యాండ్స్ వారి ఆధ్వర్యంలో 20 రోజులలోపు సర్వే పూర్తి చేసి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో మండల స్థాయి రెవెన్యూ యంత్రాంగం సర్వే చేస్తున్నారు.