సింగరాయకొండ మండలంలో పర్యటించిన షేక్ రియాజ్ మరియు జిల్లా కార్యదర్శులు

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, జనసేన బలోపేత కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలంలో పర్యటించిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ మరియు జిల్లా కార్యదర్శులు.

సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు స్థానిక ఘ్శృ కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్, ఉపాధ్యక్షులు శ్రీ చిట్టెం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీ చీకటి వంశీ, ఒంగోలు జనసేన కార్పొరేటర్ శ్రీ మలగా రమేష్ మరియు జిల్లా పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్.

తదనంతరం పోతయ్యగారి పాలెం వెళ్లి జనసేన పార్టీ కార్యకర్తలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తమిళనాడు కడలూరు నుంచి వస్తున్న బోట్లవల్ల వారికి తీవ్ర నష్టం జరుగుతుందని రియాజ్ దగ్గర వాపోయారు. సమస్య విన్న రియాజ్ వారికి భరోసా కలిపిస్తూ మీ సమస్యను కచ్చితంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సింగరాయకొండ జనసేన నాయకులు యన్నం రాము, పాడే సురేష్, రవీంద్ర పోకల, రాణా, బాలాజీ దేవినేని, చెన్నంశెట్టి సాంబ, రాజేష్, హరి చెన్నంశెట్టి, శ్రీకాంత్ కాసుల, భరత్ అడుసుమల్లి మరియు జనసైనికులు పాల్గొన్నారు.