చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేసిన సింగరాయకొండ జనసేన నాయకులు

సింగరాయకొండ ట్రంక్ రోడ్డు లోనీ జనసేన పార్టీ అధ్వరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా.. తొమ్మిది వారాలుగా.. వేసవికాలంలో దాహార్తి తీర్చడానికి ప్రతీ రోజు చల్లని మినరల్ వాటర్, మరియు వారంలో ఒక్క రోజు ఆదివారం చల్లని మజ్జిగ ప్రయాణికులకు, బాటసారులకు, యచకులకు, మరియు ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, దండే ఆంజనేయులు, దేవినేని బాలాజీ, కించం శెట్టి రవి కుమార్, కాసుల శ్రీనివాస్, అనుమల శెట్టి కిరణ్ బాబు, సయ్యద్ చాన్ బాషా, సంకే నాగరాజు, పోలిశెట్టి విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, షేక్ సుల్తాన్ బాషా, వాయుల చిన్న, సైకం ఆనంద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.