సోదరుడు స్నేహాశీష్ కి కరోనా కారణంగా క్వారంటైన్లోకి వెళ్లిన సౌరవ్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. గంగూలీ సోదరుడు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సీఏబీ) జాయింట్ సెక్రటరీ స్నేహాశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్గా తేలింది. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ ఆటగాడు స్నేహాశీష్ గంగూలీ చికిత్సం కోసం ప్రస్తుతం బెల్లె వి ఆసుపత్రిలో చేరారు. ఈ కారణంగా ప్రస్తుతం సౌరవ్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
స్నేహాశీష్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వైద్య పరిక్షలు చేయిoచగా కరోనా పాజిటివ్గా తెలిసింది. ప్రస్తుతం అతడు బెల్లె వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సీఏబీ అధికారి ఒకరు తెలిపారు. ‘రిపోర్ట్స్ బుధవారం సాయంత్రం వచ్చాయి. హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం సౌరవ్ కూడా కొద్ది రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది’ అని గంగూలీ సన్నిహితుడొకరు చెప్పారు.