చిన్నశేషుడిపై మలయప్పస్వామిగా శ్రీ వారు

తిరుమల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, గదతో దామోదర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం శ్రీవారు చిన్నశేషవాహనంపై కొలువుదీరుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు.