జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం

  • తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు

గంపలగూడెం: గురువారం రాత్రి గంపలగూడెం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి జనసేన యువతకు దిశా నిర్దేశం చేసిన తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మరియు గంపలగూడెం మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకట కృష్ణారావు వారిరువురు గంపలగూడెం మండలంలోని గాదెవారి గూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావును కలిసి గ్రామంలో ఓటర్ లిస్ట్ పరిశీలన గురించి, గ్రామ కమిటీల గురించి చర్చించడం జరిగింది. అనంతరం కొనిజర్ల గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఇలవరపు నాగేంద్రమ్మను కలిసి భవిష్యత్తులో పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. అనంతరం గంపలగూడెం మండల ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు వట్టి కొండ కృష్ణ, జరపల రామకృష్ణల, షేక్ నాగూర్ లను కలిసి మండలంలో ఉన్న ప్రధాన సమస్యల గురించి గ్రామ కమిటీల గురించి చర్చించడం జరిగింది. మరియు ఆర్లపాడు గ్రామ జనసేన నాయకులు పసుపులేటి మాధవరావు దండేల తిరుపతిరావు మరియు గ్రామ జన సైనికులను కలిసి పార్టీ బలోపేతం గురించి ఓటర్ లిస్టులో పేర్లు తనిఖీల గురించి, గ్రామ కమిటీల గురించి వారికి శ్రీ శ్రీనివాసరావు, వెంకట కృష్ణారావు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు.