గుంటూరు కార్పొరేషన్ లో మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు

గుంటూరు కార్పొరేషన్ లో వార్డులో సీతానగర్ మెయిన్ రోడ్డు వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికుల సంరక్షణకై తలపెట్టిన మూడో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. నేరెళ్ల సురేష్ పిలుపుమేరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం జయప్రదంగా చేయబడినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు సిటీ ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సోమిశెట్టి నవీన్, గుంటూరు సిటీ జనరల్ సెక్రెటరీ ఆనంద్ సాగర్, సహాయ కార్యదర్శి పులిగడ్డ గోపి, వార్డ్ సభ్యులు ఉప్పలపాటి సతీష్, చెన్నంశెట్టి గోపి మరియు సంకటి బాలాజీ దుర్గ తదితరులు పాల్గొన్నారు.