Tokyo Olympics : ఆర్చరీలో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

టోక్యో : ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడనుంది. ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్‌ను దీపికా కుమారి, జాదవ్ కలిసి ఓడించారు.

ఇక టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ జోడీ ఓటమి పాలైంది. చైనీస్ తైపీ చేతిలో శరత్ కుమార్, మనికా బత్రా ఓడిపోయారు. 4-0 తేడాతో భారత్‌పై చైనీస్ తైపీ గెలిచింది.

ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. పూల్ ఎ లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3-2తో విజయం సాధించింది. రెండు గోల్స్‌తో హర్మన్‌ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.