అణగారిన వర్గాల ఆశాజ్యోతి వంగవీటికి ఘన నివాళులు

చిత్తూరు: చరిత్ర మరువని నాయకుడు, యోధుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కాపు సంక్షేమ సేన రైతు విభాగం జిల్లా అధ్యక్షులు రమేష్ మరియు నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించగా, బలహీన బడుగు వర్గాల నుండి అనేకమంది ప్రజలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగా గారు ఆశించినట్టుగా ప్రజలు ఎవరికీ భయపడకుండా, కష్టపడి తన పని తను చేసుకుంటూ, సగర్వంగా బతకాలని, అలాంటి సమాజాన్ని నిర్మించే నాయకులను ఎన్నుకోవాలని అక్కడ ప్రజలు నిర్ణయించారు. ఈ కార్యక్రమనికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, రాజగోపాల్, కుమార్ మరియు రంగా అభ్యుదయాలను ముందుకు నడిపే యువకులు తులసి ప్రసాద్, నాసీర్, ప్రశాంత్, పురుషోత్తం, గురునాథ్ దినేష్ రాయల్, చెంగల్ రాయల్, వాసు రాయల్, మోహన్, బాలకృష్ణ, బాలాజీ, చాణిక్య, కేశవులు, కిషోర్, భార్గవ తదితరులు పాల్గొన్నారు.